రాష్ట్ర విభజన సక్రమంగా జరగలేదంటూ పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగంలో రెండు పెద్ద వాస్తవాలు బట్టబయలు అయ్యాయని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం కాంగ్రెస్తోనే జరిగింది. టీఆర్ఎస్ పాత్ర లేదు. తెలంగాణ పట్ల బీజేపీ ద్వేషభావాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు. ‘తెలంగాణ కోసం బీజేపీ చేసింది శూన్యం. తెలంగాణ అమరవీరుల ఆత్మక్షోభించేలా, వారి త్యాగాలను కించపరిచేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయి. తెలంగాణ సమాజానికి మోదీ క్షమాపణ చెప్పాలి’ అని పేర్కొన్నారు.