మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
పర్యావరణ కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుందని, సకల సృష్టికి జీవనాధరమైన గాలి, నీరు, ధరిత్రిని కలుషితం చేస్తూ పోతే భవిష్యత్ అంధకారం అవుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రకృతి వనరులను అనుభవిస్తూ పరిరక్షణ బాధ్యతను విస్మరిస్తే జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని చెప్పారు.ఢల్లీి లాంటి ప్రధాన నగరాలు వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయని, కాలుష్య నియంత్రణకు దీర్ఘకాలిక వ్యూహాల అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.అడవులను, పర్యావారణాన్ని రక్షించేందుకు తెలంగాణకు హరితహారం అనే బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించి గత కొన్ని సంవత్సరాలుగా కోట్లాది మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణ చేపడుతున్నామని తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పచ్చదనం, పరిశుభ్రతను ను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వీటిల్లో ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేయేడంతో అనుకున్న ఫలితాలను సాధిస్తున్నామని తెలిపారు.