Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా హిమాన్షు తివారీ.. సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన

అన్ని రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ సంస్ధాగత నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ దృష్టి పెట్టారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు కీలక పార్టీ పదవులను భర్తీ చేస్తోన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన కేసీఆర్‌.. తాజాగా బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీగా హిమాన్షు తివారీని నియమించారు.2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ విస్తరణపై సీఎం కేసీఆర్‌ దూకుడు పెంచారు. అందులో భాగంగా కీలకమైన రాష్ట్రాలపై కన్నేశారు. ప్రధానంగా భావించే కొన్ని రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ శాఖలను ఏర్పాటు చేయడంతో పాటు దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టారు. జాతీయ స్దాయిలో కీలక పార్టీ పదవులను భర్తీ చేస్తోన్నారు.ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా హిమాన్షు తివారీని నియమిస్తూ సీఎం కేసీఆర్‌ ప్రకటన విడుదల చేశారు. హిమాన్షు తివారీ ఉత్తరప్రదేశ్‌లోని జాన్పుర్‌లో స్వాతంత్ర సమరయోధుడి కుటుంబానికి చెందినవారు. ఇటీవల మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా మాణిక్‌ కదమ్‌ను నియమించిన గులాబీ బాస్‌.. ఇప్పుడు మహారాష్ట్రపై దృష్టి పెట్టారు. బుధవారం మహారాష్ట్రలోని పలు డివిజన్లకు బీఆర్‌ఎస్‌ డివిజనల్‌ కోఆర్డినేటర్లను కేసీఆర్‌ నియమించారు. నాసిక్‌ డివిజన్‌కు దశరథ్‌ సావంత్‌, పూణె డివిజన్‌కు బాలాసాహెబ్‌ జైరామ్‌, ముంబై డివిజన్‌కు విజయ్‌ తానాజీ మోహితే, ఔరంగాబాద్‌ డివిజన్‌కు సోమనాథ్‌ థోరట్‌, నాగ్‌పూర్‌ డివిజన్‌కు ద్యానేష్‌ వకుద్కర్‌, అమరావతి డివిజన్‌కు నిఖిల్‌ దేశ్‌ముక్‌లను నియమించారు. హిమాన్షు తివారీకి 31 ఏళ్లు. ప్రస్తుతం యువనేతగా ఉన్నారు. వారణాసిలో కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. 2015 నుంచి జాతీయ స్థాయిలో రైతుల ఆందోళనలలో చురుగ్గా పాల్గొంటున్నారు. భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నడుపుతున్నారు. 2020-21లో యునైటెడ్‌ కిసాన్‌ మోర్చాలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బీహార్‌లోని చంపారన్‌ నుంచి యూపీలోని బనారస్‌ వరకు జన్‌జాగరణ్‌ పేరుతో గతంలో 21 రోజుల పాటు పాదయాత్ర చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img