ముఖ్యమంత్రి కేసీఆర్.. బుధవారం ఉదయం తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ను పరామర్శించారు. మాజీ గవర్నర్ నరసింహన్ అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు సోమవారం శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ నరసింహన్ను కావేరీ ఆస్పత్రిలో పరామర్శించారు. మాజీ గవర్నర్ మరో 3-4 రోజులు ఆస్పత్రిలోనే ఉండనున్నారు.