బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
బోయిగూడ టింబర్ డిపోలో ఈ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.అగ్ని ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను కేసీఆర్ ప్రకటించారు. వలస కార్మికుల మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా సీఎం ఆదేశాల ప్రకారం అవసరమైన చర్యలు చేపడుతున్నామని సీఎస్ వెల్లడిరచారు.