కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ను పంజాబ్ రైతులే నమ్మలేదని, చైతన్యవంతులైన తెలంగాణ రైతులు ఎలా నమ్ముతారని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. అది రైతు సంఘరణ సభ కాదని, రాహుల్ సంఘర్షణ సభ అని తెలంగాణ ప్రజానికం భావిస్తున్నదని చెప్పారు. వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నిందని ట్విటర్ వేదికగా రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నిందని ట్విటర్ వేదికగా రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.