: మంత్రి సత్యవతి రాథోడ్
అనాథలు, కోవిడ్ వల్ల అనాథలుగా మారిన పిల్లలకు సంబంధించి మంగళవారం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేసిందని.. అనాథలు అయిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వారి భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వారి బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించిందన్నారు.తల్లి, బిడ్డల సంరక్షణకు అంగన్వాడీల సేవలు ఇంకా పెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, యూనిసెఫ్ ప్రతినిధి మురళి, ఎస్సీపీసీఆర్ చైర్మన్ శ్రీనివాసరావు, సభ్యులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.