Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

అప్పుడు దేవుళ్లని ఇప్పుడు రోడ్డున పడేశారు

స్టాఫ్‌ నర్సుల తొలగింపుపై సీఎంకు రేవంత్‌ రెడ్డి లేఖ

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : కరోనా సమయంలో స్టాఫ్‌ నర్సులను దేవుళ్లని పొగిడిన సీఎం కేసీఆర్‌ నేడు వారిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుండి తొలగించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఆ దేవుళ్లు ఇప్పుడు ప్రగతి భవన్‌ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్న పటించుకునే నాధుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఉన్నట్టుండి ఉద్యోగాలు తొలగించి 1600 కుటుంబాలను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ప్రగతి భవన్‌కు వస్తే ఐదు నిముషాలు వాళ్ల గోడు వినే తీరిక మీకు లేదా అని నిలదీశారు.
ప్రగతి భవన్‌ ప్రజల కష్టాలు విని, కన్నీళ్లు తుడవాల్సిన సీఎం కార్యాలయమా లేక కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ కార్యాలయమా అన్ని ప్రశ్నించారు. 2018లో ఎంపికైన ఎఎన్‌ఎంలకు ఇప్పటికీ పోస్టింగులు ఎందుకు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. 50 వేల ఉద్యోగాల భర్తీపై మీరు చేసిన ప్రకటన చీటింగ్‌ ‘‘వన్స్‌ మోర్‌’’ లాగా ఉందన్నారు. ప్రభుత్వంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్‌ కమిటీ నివేదిక ఇస్తే మీరు 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం ఏమిటన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ సంగతి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. స్టాఫ్‌ నర్సులను యథాతథంగా విధుల్లో కొనసాగించడంతో పాటు 2018 ఎఎన్‌ఎం అభ్యర్థులకు తక్షణం పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రభుత్వంలోని 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలతో పాటు, కార్పొరేషన్ల లోని ఖాళీల భర్తీకి తక్షణం షెడ్యూల్‌ ప్రకటించాలన్నారు. లేని పక్షంలో అతి త్వరలో నిరుద్యోగ యువత తరఫున టీపీసీసీ కార్యచరణ ఉంటుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img