అమరవీరుల స్థూపం నిర్మాణంపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. రూ.63 కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ను రూ.180 కోట్లకు పెంచినా ఇంకా ఎందుకు పూర్తి చేయలేదన్నారు. ఈ టెండర్ను ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన కెపీసీ కంపెనీకి ఇచ్చారన్నారు. కంపెనీకి ఎలాంటి అనుభవం లేకున్నా తప్పుడు సర్టిఫికెట్తో పనులు అప్పగించారని అన్నారు. పిడికెడు ఏపీ కాంట్రాక్టర్లు తెలంగాణని దోచుకుంటున్నారన్న కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ను ఏపీ వారికే ఎందుకిచ్చారో సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణలో ఎవరూ అర్హులు లేరా అని ప్రశ్నించారు.