ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, ఇతర ఉన్నతాధికారుల బృందం నేడు అమెరికా పర్యటనకు బయలుదేరింది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీల అధిపతులు, సీనియర్ ప్రతినిధి బృందాలతో సమావేశమవుతారు.