: విజయశాంతి
సీఎం కేసీఆర్పై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగం వింటే అరచేతిలో వైకుంఠం చూపించడమంటే ఏమిటో బాగా అర్థమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలోని దళితుల సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం దళిత బంధు పథకం అన్నట్టుగా చెప్పుకొచ్చారన్నారు. ఆరంభ శూరత్వం తప్ప మరొకటి తెలియని కేసీఆర్ నైజం అందరికీ తెలిసిందేనని అన్నారు.