రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గోపాల్ నగర్లో మండపం నుండి వినాయకుని ప్రతిమను దొంగలు ఎత్తుకెళ్లాడు. ఈ వీధిలోని చిన్నారులంతా కలిసి చందాలు వేసుకుని మండపాన్ని ఏర్పాటు చేశారు. అయితే బుధవారం రాత్రి పూజల అనంతరం పిల్లలు, స్థానికులు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. గురువారం ఉదయం మండపానికి వచ్చి చూసేసరికి విగ్రహం కనిపించకపోవడంతో అందరూ అవాక్కయ్యారు.