అర్హులందరికి ఆసరా పెన్షన్లు అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నూతంగా మంజూరైన ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గడచిన 70 సంవత్సరాలుగా ప్రజలు తాగునీటికి, విద్యుత్కు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కేవలం 200 రూపాయల పెన్షన్ తో నెట్టుకొచ్చారన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో 7,436 మందికి నెల నెలా 32 లక్షల రూపాయల పెన్షన్ ఇచ్చే వారని, ఇప్పుడు 13,029 మందికి 8 కోట్ల 63 లక్షల రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎదిర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు.ఇంకా పింఛన్ రాకుండా మిగిలిపోయిన వారిని గుర్తించి మళ్లీ పెన్షన్లు ఇస్తామని మంత్రి తెలిపారు.