అర్హులైన 57 ఏండ్ల వాళ్ళందరికీ పెన్షన్లు అందించనున్నమని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 60ఏళ్లు నిండిన అర్హత ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. సీఎం చేతుల మీదుగా ఈ కొత్త పెన్షన్లు ప్రారంభిస్తామని తెలిపారు.