సీఎస్ సోమేష్ కుమార్
దళిత బంధు రాష్ట్రం మొత్తం అమలు జరుగుతుందని, అర్హులైన వారందరికీ అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ తెలిపారు. అనుమానాలు ఏమీ అవసరం లేదని, దళిత బంధు అద్భుతమైన పథకమని కొనియాడారు. బహిరంగసభ ఏర్పాట్లు, దళిత బంధుపై మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తోపాటు సీఎస్ సోమేష్ కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ, ఈనెల 16న సీఎం సభలో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందిస్తారని పేర్కొన్నారు.