Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అర్హులకు నిష్పక్షపాతంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

అర్హులకు నిష్పక్షపాతంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను కేటాయించామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూర్‌లో లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ఇండ్లు ఇచ్చి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. ఏడేళ్లలో సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో సొంత జాగా ఉన్నవారందరికి డబుల్‌ ఇండ్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img