నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, మరో రెండు రోజుల్లో వాయుగుండం మారే అవకాశం ఉందని వెల్లడిరచింది. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు చాలా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడిరచింది. రానున్న మూడు రోజుల్లో ఒకట్రెండు చోట్ల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.