Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

అసోం సీఎంపై చర్యలు తీసుకోవాలి : రేవంత్‌రెడ్డి


ఎన్నికల అధికారులు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మీద క్రిమినల్‌ కేసులు పెడతారని ఆశించామని… ప్రధాని నిస్సిగ్గుగా బిశ్వ శర్మను సమర్ధిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మహిళలను అవమానించారని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అసోం సీఎంపై చర్యలు తీసుకోవడంలో అసోం పోలీస్‌, ఎన్నికల వ్యవస్థలు విఫలం అయ్యాయన్నారు.. బిశ్వ శర్మ వ్యాఖ్యలతో దేశంలోని మాతృమూర్తులకు అవమానం జరిగిందన్నారు. అందుకే తాము ఇక్కడ కేసులు పెడుతున్నామని… వెంటనే అసోం సీఎంపై క్రిమినల్‌ కేసులు పెట్టి నోటీస్‌లు పంపాలని డిమాండ్‌ చేశారు. బిశ్వ శర్మను అరెస్ట్‌ చేసి తీసుకురావాలన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఓ స్పెషల్‌ టీంను ఏర్పాటు చేయాలని తెలిపారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని అసోం సీఎంను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. చర్యలు తీసుకోకపోతే 16న పోలీస్‌ కమిషనర్‌, ఎస్పీ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img