అప్పాపూర్లో నల్లమల చెంచుపెంటలకు చెందిన గిరిజనులతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సమావేశమయ్యారు. అటవీశాఖ చేపట్టిన కార్యక్రమాల ప్రదర్శనను వీక్షించారు.ఆరోగ్య ఉపకేంద్రం, టైలరింగ్ శిక్షణా కేంద్రం, ఆశ్రమ పాఠశాలలను గవర్నర్ తమళిసై ప్రారంభించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆదివాసిలకు సూచించారు. మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. న్యూట్రిషన్ పథకం చాలా ప్రత్యేకమైందని, టూ వీలర్ అంబులెన్స్, రాజశ్రీ కోళ్లు, మందులు అందించడం ఆనందం కలిగిస్తుందన్నారు. భౌరాపూర్ పథకం ఇతర పెంటలకు విస్తృతం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పని చేయాలని సూచించారు. తన ప్రయత్నంలో సహకరించిన రెడ్ క్రాస్, కలెక్టర్, తదితర శాఖలకు అభినందనలు తెలిపారు.