Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆరవ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ ఆరవ రోజుకు చేరుకుంది. నేడు మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం లేమురు వద్ద షర్మిల ‘మాట ముచ్చట’ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నెల 20వ తేదీన షర్మిల రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో తన పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img