Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఆరు ఎయిర్‌పోర్టుల్లో మూడు మాత్రమే అనుకూలం

ఎయిర్‌పోర్టుల టెక్నో ఎకనామిక్‌ ఫీజిబిలిటీ తుది రిపోర్టులు కేంద్రం నుంచి అందాయి. మొత్తం ఆరింటిలో 3 మాత్రమే అన్ని రకాల తగిన విధంగా ఉన్నాయని ఎయిర్‌ పోర్టు అథారిటీ తన నివేదికలో పేర్కొంది. తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్‌ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటివల్ల కలిగే లాభనష్టాలను భారత విమానయాన సంస్థ బేరీజు వేసింది. వరంగల్‌లోని మామూనూర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి మాత్రమే పూర్తిస్థాయి విమానాశ్రయాలకు అనుకూలంగా ఉన్నాయని నివేదించాయి. భద్రాద్రి కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్ర, పెద్దపల్లిలోని బసంత్‌ నగర్‌ ఎయిర్‌ పోర్టుల ఏర్పాటుకు, పెద్ద విమాన రాకపోకలకు అంతగా అనుకూలంగా లేవని భారత విమానయాన సంస్థకు ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img