మంత్రి హరీష్ రావు
నీలోఫర్ ఆస్పత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును శనివారం మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.18 కోట్లు అందించామని చెప్పారు. ఆరోగ్యశాఖ అభివృద్ధికి . రూ.10 వేల కోట్లు కేటాయించామన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచాలన్నారు.కేసీఆర్ కిట్లు వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. రూ.33 కోట్లతో నీలోఫర్లో మరో 800 పడకలు అందుబాటులోకి తెస్తామన్నారు.