ఆర్టీసీ పరిరక్షణతో పాటు, సిబ్బంది కార్మికుల సంక్షేమం మొదటి ప్రాధాన్యత లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు. డ్రైవర్లు, కండక్టర్ లు, సిబ్బంది కమిట్మెంట్తో పనిచేయాలని సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. శశాంక, అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతం, ఎమ్మెల్యే శంకర్ నాయక్ సజ్జనార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఆదాయ మార్గాలను పెంచుకుని ఆర్టీసీని బలోపేతం చేయాలని ఆర్టిసీ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఇంధనం పొదుపు చేసిన ఇద్దరు డ్రైవర్లు బి. గోపాల్, సుధాకర్కు జిల్లా కలెక్టర్ కె. శశాంక, అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతం చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకం అందజేసి అభినందించారు.