సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీగా బస్ భవన్లో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.వారం రోజుల క్రితం సజ్జనార్ను ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఆయన స్థానంలో సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా రవాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ కొనసాగారు.