తెలంగాణలోని పల్లెవెలుగు బస్సు టికెట్ ధరల్లో రౌండప్ విధానాన్ని ఆర్టీసీ అమల్లోకి తీసుకొచ్చింది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రౌండప్ చార్జీలను ఖరారు చేశారు. నేటి నుంచి ఈ కొత్త(రౌండప్) చార్జీలను ఆర్టీసీ అమలులోకి తీసుకువచ్చింది. రూ.12చార్జీ ఉన్న చోట టికెట్ను యాజమాన్యం రూ.10 రౌండప్ చేసింది. రూ.13, రూ.14 ఉన్న చోట.. ఆ టికెట్లను రూ. 5గా రౌండప్ చేశారు. 80 కీలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు రూ.67 వసూలు చేస్తుండగా రౌండప్ ఖరారుతో చార్జీలు రూ.65గా నిర్ధారించారు. టోల్ ప్లాజాల వద్ద ఆర్డినరీకి రూ.1.. హైటెక్, ఏసీ బస్సులకు రూ.2 వసూలు చేయనున్నారు.