Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆర్టీసీ ప్రయాణంపై ‘రాధే శ్యామ్‌’ చిత్రాన్ని వాడుతూ చేసిన మీమ్స్‌ వైరల్‌

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజలకు రవాణా సేవలను మరింత దగ్గర చేసి.. సంస్థలను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఆర్టీసీపై చేస్తున్న మిమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి.గతంలో ఎన్నో కొత్త సినిమాలను ఆర్టీసీ బస్సుల ప్రమోషన్‌ల కోసం వాడుకున్న మీమ్స్‌ వైరల్‌ కాగా.. తాజాగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘రాధే శ్యామ్‌’ చిత్రాన్ని వాడుతూ చేసిన మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీమ్స్‌లో ‘చాలా రోజుల తర్వాత కలిశాం.. ఏదైనా టూర్‌కి వెళ్తాం’ అని ప్రభాస్‌ అనగా.. దీనికి ‘వెళ్దాం కానీ.. ఆర్టీసీ బస్సులోనే వెళ్దాం’ అని పూజా హెగ్డే బదులిస్తుంది. ఎందుకు? అని ప్రభాస్‌ ప్రశ్నించగా.. ‘ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం..సుఖమయం’ అంటూ బదులిచ్చినట్లు’ ఉన్న మీమ్‌ను సజ్జనార్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 2400 మంది వరకు ట్వీట్‌ను లైక్‌ చేయగా.. 996 మంది రీ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img