Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారమే బ్యాంకులు వడ్డీ తీసుకోవాలి : మంత్రి హరీష్‌ రావు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాల ప్రకారమే ఎస్‌హెచ్‌జీ(స్వయం సహాయక బృందాల) ల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, అధికంగా వసూలు చేసిన సొమ్మును వడ్డీతో సహా ఎస్‌హెచ్‌జీలకు నెలరోజుల్లో చెల్లించాలని మంత్రి ఆదేశించారు. మంత్రి హరీష్‌ రావు అధ్యక్షతన స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ 35వ సమీక్ష సమావేశం ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీలో శుక్రవారం జరిగింది. సమీక్షలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ డేబశిష్‌ మిత్రా, ఎస్‌ఎల్‌బీసీ ప్రెసిడెంట్‌ అమిత్‌ జింగ్రాన్‌, నాబార్డ్‌ సీజీఎం చింతల సుశీల, ఆర్బీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కేఎస్‌ చక్రవర్తి, అన్ని బ్యాంకుల ప్రతినిధులు, రైతు, చిన్న పరిశ్రమల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వయం సహాయక బృందాలు సకాలంలో, పూర్తిస్థాయిలో వడ్డీలు చెల్లిస్తూ ఆదర్శంగా ఉన్నాయన్నారు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నాయన్నారు. నిబంధనల ప్రకారం, రూ. 3 లక్షల లోపు రుణాలకు 7 శాతం, రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షలకు వరకు 10 శాతం వడ్డీ రేటు అమలు చేయాలని సూచించారు. మారిన వడ్డీ రేట్లను అమలు చేయడం లేదని, దీని వల్ల ఎస్‌హెచ్‌జీలు, ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉందన్నారు. అన్ని బ్యాంకులు తక్షణం ఆర్‌బీఐ నిబంధనలు అనుసరించాలని ఆదేశించారు. 2022-23కు గాను అధికంగా వసూలు చేసిన వడ్డీని ఎస్‌హెచ్‌జీలకు తిరిగి చెల్లించాలని ఆదేశించారు. బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఫీజు, ఇన్స్పెక్షన్‌, పోర్ట్‌ ఫోలియో, మెంటేయినేన్స్‌ వంటి సేవల పేరుతో రూ. 500 నుంచి రూ. 5000 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అయితే మొబిలైజేషన్‌, ఎంసిపి ప్రిపరేషన్‌, డాక్యుమెంటేషన్‌, మానిటరింగ్‌, రికవరీ వంటి సేవలను సెర్ప్‌ సిబ్బంది నిర్వహిస్తున్నారని చెప్పారు. కాబట్టి బ్యాంకులు ఎస్‌హెచ్‌జీల రుణాలకు చార్జీలను వసూలు చేయడంలో ఎలాంటి అర్థం లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img