Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు పెంచాలి

రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆర్‌టీ`పీసీఆర్‌, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా పాటించాలని హైకోర్టు స్పష్టంచేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణపై ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు విచారణ సందర్భంగా ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img