Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి అంకురార్పణ చేశారు. సరస్వతి అమ్మవారి గర్భాలయ పునః నిర్మాణంతో పాటు ఇత‌ర అభివృద్ధి ప‌నులకు జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డిలతో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శుక్ర‌వారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే రూ.8కోట్ల వ్యయంతో ఆలయ పరిసరాల్లో విశ్రాంతి భవనాలు, తదితర పనులు చేప‌ట్ట‌గా, రూ.22 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ఆలయం పునః నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లు సీఎం కేసీఆర్ చూస్తానని చెప్పడం జరిగిందని, త్వరలోనే సీఎంకి ప్లాన్లు చూపెట్టడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత టెండర్ల ప్రక్రియలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఒకటైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయడం జరుగుతుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్ర‌మంలో ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి విజ‌యరామారావు, ఇత‌ర అధికారులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img