Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆ దొంగలకు వేరే పని తెలీదు

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై ప్రకాశ్‌ రాజ్‌ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. అదే పని ఇప్పుడు తెలంగాణలోనూ చేస్తున్నారన్నారు. ‘‘ఆ దొంగలకు వేరే పని తెలీదు. ఇక్కడ కొత్తగా ఏమీ చెయ్యట్లేదు. కర్ణాటక, మహారాష్ట్ర.. ఇలా అన్ని చోట్లా వారు ఇలానే చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి. బీజేపీ, మోడీనో కాదు.. ఎవరైనా ఇలాంటి పనిచేస్తున్నప్పుడు ప్రజలు, మీడియా ప్రశ్నించాలి’’ అంటూ ఓ నటుడిగా తన అభిప్రాయాన్ని మీడియా ముందు వ్యక్త పరిచారు. కేసీఆర్‌ కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటారని.. ప్రస్తుత పరిస్థితుల్లో అలా ఉండక తప్పదన్నారు. అయితే, ఆయన వైఖరి కొందరికి నచ్చలేదని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆయన్ని అర్థం చేసుకొని కేసీఆర్‌ వెంట ఉంటారని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img