Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇంటర్‌ అధ్యాపకులకు డిసెంబర్‌ నుంచి బయోమెట్రిక్‌ అమలు

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో డిసెంబర్‌ ఒకటో తారీఖు నుంచి బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ తప్పనిసరి చేస్తూ అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో 405 జూనియర్‌ కాలేజీలుండగా.. ప్రతి కాలేజీలో 4 సీసీ కెమెరాలు, 2 బయోమెట్రిక్‌ హాజరు పరికరాలు బిగించి గతంలో బయోమెట్రిక్‌ హాజరును అమలుపరిచారు. కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి దీనిని ఉపసంహరించారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి మళ్లీ బయోమెట్రిక్‌ హాజరును అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాలేజీల్లో గతంలో బిగించిన బయోమెట్రిక్‌ పరికరాలను అధికారులు పరీక్షించనున్నారు. వివరాలు అందిన తర్వాత పనిచేయని వాటికి రిపేర్లు చేయించి వినియోగంలోకి తీసుకురానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img