Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఇంటర్‌ పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష సమావేశం

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు 25 నుంచి ప్రారంభం అవుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్‌ పరీక్షలపై అన్ని శాఖల అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో కరోనా కారణంగా ప్రమోట్‌ చేసిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామని, నాలుగు లక్షల యాభై వేలకు పైగా విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 1750కి పెంచడం జరిగిందని చెప్పారు. 25 వేల మంది ఇన్విజిలేటర్‌లు పాల్గొంటున్నారని, పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు గంట ముందు వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img