Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఇంట గెలిచాక..రచ్చ గెలవండి

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల సెటైర్లు
ఇంట గెలిచాక..రచ్చ గెలవండి దొరా అంటూ ుుఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల వ్యాఖ్యలు చేశారు.తమిళనాడు ముఖ్యమంత్రితో మాటామంతికి…. కేరళ సీఎంతో మంతనాలు చేయడానికి.. బీహార్‌ ప్రతిపక్ష నేతను కలసి దోస్తానా చేయడానికి…. దేశ రాజకీయాల మీద చర్చ చేయడానికి సమయం ఉంది..కానీ చనిపోతున్న రైతులను ఆదుకోవాలనే సోయి లేదని అన్నారు. మీ రైతుబంధు వారోత్సవాల సాక్షిగా..బ్యాంకుల ఆగడాలకు రైతులు బలైపోతున్నది… మీకు కనపడుతుందా దొరా? అని ప్రశ్నించారు. పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకొనే రైతులు, వడ్డీ వ్యాపారుల చేతుల్లో నష్టపోయిన రైతులు, రుణాలు చెల్లించలేక ప్రాణాలు తీసుకొనే రైతులు మీకు కనపడరా అని నిలదీశారు. ముందు ఇక్కడి రైతుల చావులను ఆపి తరువాత దేశాన్ని ఏలపోండి అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img