: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఇండ్ల కేటాయింపులో పారదర్శత కోసమే ముందుగానే లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇందిరానగర్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించే సమావేశంలో మంత్రి తలసాని పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద ప్రజలు సైతం సొంత ఇంటిలో సంతోషంగా, గొప్పగా బతుకాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమని అన్నారు. పేదలకు ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తున్న పథకం తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదన్నారు.