హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు గుడ్ న్యూస్.ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి లండన్కు వెళ్లే విమానాలు మధ్యలో ఆగేవి అయితే తాజాగా ఎయిర్ ఇండియా కొత్తగా నాన్ స్టాప్ విమాన సర్వీలను ప్రారంభించింది. ప్రస్తుతం ఢల్లీి, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అమృత్సర్, కొచ్చి, అహ్మదాబాద్, గోవా నుంచి నేరుగా లండన్ నాన్స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ఈ జాబితాలోకి హైదరాబాద్ కూడా చేర్చింది. ఈ సర్వీసులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. లండన్ నుంచి హైదరాబాద్ బయలు దేరిన నాన్స్టాప్ విమానం గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనుంది. ఈ విమానంలో మొత్తం 256 సీట్లు ఉంటాయి. వీటిటో 18 బిజినెస్ క్లాస్ కాగా, మిగతా 238 సీట్లు ఎకానమి క్లాస్ సీట్లు ఉంటాయి. ఈ సర్వీసుల్లో భాగంగా ప్రతీ సోమ, శుక్రవారాల్లో హైదరాబాద్ నుంచి లండన్కు నాన్స్టాప్ విమాన సర్వీసులు నడవనున్నాయి.