ఇంక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాన నరేంద్ర మోదీ హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పటాన్ చెరులోని ఇక్రిశాట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ను మోదీ సందర్శించారు. ప్రధానిని ఇక్రిశాట్ డైరక్టర్ జనరల్ జాక్వెలిన్ డి ఆరోస్ సన్మానించారు. ఇక్రిశాట్ పరిశోధనల పురోగతిపై శాస్త్రవేత్తలు వివరించారు. కొత్త వంగడాల రూపకల్పన, రైతులకు చేరవేస్తున్న తీరుపై వివరించారు. ప్రధాని వెంట కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, నరేంద్ర సింగ్ తోమర్ తెలంగాణ గవర్నర్ డా.తమిళిసై ఉన్నారు.