దేశంలో డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది.రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. ఈ ప్రాజెక్టును కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. వికారాబాద్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నెలరోజులపాటు దీనికి సంబంధించిన ట్రయల్రన్ జరగనుంది.