: మంత్రి కేటీఆర్
మలక్పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో బహుముఖమైన అభివృద్ధి జరుగుతోందని అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, రహదారుల విస్తరణ, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే బలాల ఎన్నోసార్లు సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించారు.వీటన్నింటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ చౌరస్తాలో ఒక వేళ ప్రయివేటు బిల్డర్ ఇల్లు కట్టి ఉంటే.. ఒక్కో ఇల్లు రూ. 50 నుంచి రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసి ఉండేవి. కానీ సీఎం కేసీఆర్ నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఉచితంగా ఇండ్లు కట్టించి ఇస్తున్నారని అన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా.. పనులు చేస్తున్నాం. ఇది ఇల్లు కాదు.. పేద వాడి ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. అన్ని హంగులతో ఈ ఇండ్లను నిర్మించాం. 19 షాపులను ఏర్పాటు చేశాంఅభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కిపోదు అని స్పష్టంచేశారు.