80,039 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్కు యావత్ తెలంగాణ యువత తరపున పాదాభివందనం చేస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ, ఇది కొలువుల జాతర కాదు.. కొలువుల కుంభమేళా అని పేర్కొన్నారు. ఉత్కంఠతో చూసిన ఉద్యోగ అభ్యర్థులు సంబురాలు చేసుకున్నారు. విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు చదువులో మునిగిపోయారని అన్నారు. కేసీఆర్ ప్రకటన నమ్ముతాం అనే వారు చదువుల్లో నిమగ్నమయ్యారు. నమ్మం అనే వారు మోదీ ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.