ఇది ప్రజాహితం కోరే బడ్జెట్ కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేంద్ర బడ్జెట్ చూస్తే చాలా బాధాకరంగా ఉందని, ఈ ప్రభుత్వానికి ప్రధాన్యతలు కూడా తెలియదని, పన్నుల వసూలు పెరిగిందని బల్లలు చర్చడం సిగ్గుచేటని అన్నారు. కంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేద ప్రజల మీద భారం తగ్గించడానికి కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులు ఇవ్వడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రాణం బీజేపీ చేతిలో ఉందని, కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. పీఎం మోదీ నిన్న యూపీలో మాట్లాడిన మాటలు ప్రధాని పదవిని అవమానించేలా ఉన్నాయన్నారు. దేశ అప్పులు 232.8 బిలియన్ డాలర్ల నుంచి 1626 బిలియన్ డాలర్లకు పెరిగిందన్నారు. ఏడిరతల అప్పులు పెంచి దేశాన్ని దివాళా తీశారని విమర్శించారు.