షర్మిల ట్వీట్
కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను ఉపసంహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర ప్రకటించిన నేపధ్యంలో షర్మిలా ట్విట్టర్ వేదికగా స్పందించారు ప్రజలను భాగస్వామ్యం చేయకుండా చేసిన ఏ చట్టమైనా జనాగ్రహానికి గురికావాల్సిందేనని పేర్కొన్నారు. చీకటి చట్టాలను ఇప్పటికైనా రద్దు చేసినందుకు సంతోషమన్నారు. ఇది రైతులు సాధించిన గొప్ప విజయంగా ఆమె అభివర్ణించారు.