Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఈఎస్‌ఐ దవాఖానను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌..

రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా హుజూర్‌నగర్‌ చేరుకున్న కేటీఆర్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి స్వాగతం పలికారు. హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ దవాఖానను, ఎస్టీవో కార్యాలయం, బస్తీ దవాఖాన, ఎమ్మెల్యే క్యాపు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం కేతవారిగూడెం నుంచి మునగాలకు నిర్మించే రోడ్డును, నేరేడుచర్ల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హుజూర్‌నగర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని చండూరుకు చేరుకుని, మున్సిపాలిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img