Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4694 డెంగీ కేసులు : మంత్రి హరీశ్‌రావు

2018-19తో పోలిస్తే ఇప్పుడు డెంగీ తీవ్రత తక్కువగానే ఉందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు.డెంగీ జ్వరానికి ఆరోగ్య శ్రీలో చికిత్స అందిస్తున్నామని, దీనిపై ప్రయివేటు ఆస్పత్రులకు కూడా ఆదేశాలు ఇస్తామని తెలిపారు. 2018లో 6,362, 2019లో 13,361 కేసులు నమోదు అయ్యాయని, 2020లో కరోనా కారణంగా అందరూ ఇండ్లకే పరిమితం కావడం వల్ల డెంగీ కేసులు ఎక్కువగా నమోదు కాలేదని చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4694 కేసులు వచ్చాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img