Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఈ ఏడు కోటి 8 లక్షల చీరల పంపిణీ : మంత్రి తలసాని

సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలేనని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సనత్‌ నగర్‌ లోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సంవత్సరం కోటి 8 లక్షల చీరల పంపిణీ చేయనున్నట్టు మంత్రి వెల్లడిరచారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు మరింత గుర్తింపు తీసుకు వచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందన్నారు.మహిళలు బతుకమ్మను గొప్పగా జరుపుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img