కేసీఆర్ సర్కార్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు.హౖదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్నగర్లో అర్ధరాత్రి కొందరు యువకులు హల్చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన రేవంత్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్లోనే.. అంటూ ఆయన ట్వీట్ చేశారు‘ ‘ఆసిఫ్నగర్లో మందుబాబులు పోలీసు వాహనం ఎక్కి వీరంగం వేసి, వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చింది. ఈ నగరాన్ని.. ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా!? పౌర సమాజం ఆలోచన చెయ్యాలి.’ అంటూ రేవంత్ ట్వీట్లో పేర్కొన్నారు.