ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణకు తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 11 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ సమావేశమై అసెంబ్లీ ఎజెండాను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.