రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై ఆధిపత్యం కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు తెలంగాణలో అమలు కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కి 2023లో ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. డిసెంబర్ 9 తరువాత తాను వరి కుప్పల దగ్గరే ఉంటానన్నారు. ధాన్యం ఎట్లా కొనరో తామూ చూస్తామని పేర్కొన్నారు.