బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు.2014 సంవత్సరం నుండి 35 ప్రతిష్ఠాత్మక సంస్థలు అంటే.. ఐఐటీ,ట్రిపుల్ ఐటీ,ఐఐఎస్ఈఆర్ ఎన్ఐడీ వంటివి స్థాపిస్తే.. తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా రాలేదని అన్నారు. బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాల పాలన నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాల వల్ల తెలంగాణాకు శాపమని అన్నారు.