రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 26 వ తేదీన జరగనున్న వాటర్ వర్క్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి ఎన్నికలలో టీఆర్ఎస్ కార్మిక విభాగం తరఫున పోటీలో ఉన్న రాంబాబు యాదవ్ మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. టీఆర్ఎస్ అనుబంధ సంఘం అభ్యర్థి రాంబాబు యాదవ్ నిచ్చెన గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతోనే ఉద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉత్పన్నమైన తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీనిచ్చారు.