Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఓటమి భయంతోనే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు : తలసాని


ప్రజల కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు ఉందా అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు. బుధవారం హూజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ప్రజల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పే ధైర్యం తమకుందని, కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఏం చేశారో చెప్పాలని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచడమే మీరు చేసిన అభివృద్ధా అని అడిగారు. ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ నేతలు ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హుజూరాబాద్‌ లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు గెలుపు ఖాయం అని, టీఆర్‌ఎస్‌ పార్టీ యే తమకు శ్రీ రామరక్ష అని అన్ని వర్గాల ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img